నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుల్లూర్లో కొనసాగుతున్న తవ్వకాలు
Published on Thu, 07/23/2015 - 00:17
వేటాడే పరికరం లభ్యం
సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూర్ గ్రామ శివారులో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలు కొనసాగుతున్నాయి. బుధవారం పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తవ్వకాలను పరిశీలించారు. బృహత్శిలా యుగపు సమాధుల తవ్వకాల్లో భాగంగా జంతువులను వేటాడే పరికరం (ఈటె) కనిపించింది. ఇది ప్రస్తుతం 61 సెంటీమీటర్ల మేర బయటకు కనిపిస్తోంది. అది సుమారుగా మీటరు లోతున ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే భోజనం చేసే బౌల్స్, ఉలి (చీజిల్), మృణ్మయ పాత్రలు, ఇతర ఇనుప పనిముట్లు లభ్యమవుతున్నాయి. పనులను ఎప్పటికప్పుడు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకులు టి. ప్రేమ్కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తి పరిశీలిస్తున్నారు.
#
Tags