amp pages | Sakshi

4 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి

Published on Fri, 09/09/2016 - 01:55

కృష్ణా జలాలపై ట్రిబ్యునల్‌లో ఏపీ వాదన
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని సెక్షన్-89 పరిధిపై కృష్ణా ట్రిబ్యునల్‌లో తుది వాదనలు పూర్తయ్యాయి. కృష్ణా నదీజలాల్ని పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలమధ్య పంపిణీ చేయాలా? లేక రెండు తెలుగు రాష్ట్రాలమధ్యే పంపకాలు చేయాలా? అన్న వివాదంపై గురువారం వాదనలు ముగి శాయి. తీర్పును మూడు వారాల తరువాత ప్రకటిస్తామని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఏపీ విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఆస్తులు పంచినట్టే.. కృష్ణా జలాల్నీ పంపిణీ చేయాలని కేంద్రం బుధవారం వాదించగా..

ఈ వివాదాన్ని ఏపీ, తెలంగాణలకే పరిమితం చేసే అధికారం కేంద్రానికికానీ, సుప్రీంకోర్టుకు కానీ లేదని, నీటి వివాదాల్లో సర్వాధికారాలు ట్రిబ్యునల్‌కే ఉన్నాయని తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేయడం తెలి సిందే. గురువారం ట్రిబ్యునల్ ముందు ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నీటి కేటాయింపులను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని పార్లమెంటు భావించి ఉంటే ట్రిబ్యునల్‌ను ప్రస్తావించకపోయేదన్నారు.

రెండేళ్లుగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక పరిధిలోని రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలుండగా.. దిగువ నున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అడుగంటాయన్నారు. ఇవి రెండూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులన్నారు. కర్ణాటక చెబుతున్నట్టుగా కృష్ణాజలాల కేటాయింపుల్ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం సరికాదని, నాలుగు రాష్ట్రాలమధ్య చేపడితేనే ఏపీ, తెలంగాణలకు న్యాయం జరుగుతుందన్నారు.
 
గోదావరినీ తీసుకుందామా..?
కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది నారిమన్ వాదిస్తూ.. ‘‘ఏపీని విభజన చేస్తున్నట్టు 2009లోనే ప్రకటన వెలువడింది. అయితే కృష్ణా నీటికేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్ 2010లో తీర్పు వెలువరిం చింది. తరువాత దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా.. ట్రిబ్యునల్‌లో తిరిగి వాదనలు ప్రారంభమైనా ఏపీ, తెలంగాణల నుంచి ఏ ఒక్కరూ అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు లేవనెత్తడమేంటి?’’ అని ప్రశ్నించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 4కు, విభజన చట్టంలోని సెక్షన్-89కు సంబంధం లేదన్నారు. సెక్షన్-89 రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందన్నారు. ఏపీ వాదిస్తున్నట్టు ఈ చట్టం ప్రకారం కృష్ణాజలాల్ని నాలుగు రాష్ట్రాలమధ్య పంపిణీ చేయాలంటున్నారు కాబట్టి.. ఇలాగైతే గోదావరి జలాల్నీ ట్రిబ్యునల్ పరిధిలోని తేవాలని, అప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలన్నీ నీటిపంపకాలకోసం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌