amp pages | Sakshi

ముక్కులో పేపర్లు కుక్కి...

Published on Thu, 03/17/2016 - 19:06

హైదరాబాద్ : పాతబస్తీలో  సంచలనం రేపిన 15 ఏళ్ల అభయ్‌ కిడ్నాప్‌ మిస్టరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను విజయవాడలో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశౄరు. అరెస్ట్ చేసినవారిని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ అభయ్ను హతమార్చింది బంధువులా, పని మనుషులా, ఇతర వ్యక్తులా అనేది తెలియాల్సి ఉందన్నారు. కిడ్నాపర్లు హత్య చేసిన తర్వాతే అభయ్ తండ్రికి ఫోన్ చేసి ఉంటారని అన్నారు.

షాహీనాయత్‌ గంజ్‌లోని శ్రీకాలనీకి చెందిన అభయ్‌.. బుధవారం మధ్యాహ్నం అల్పాహారం తెచ్చుకునేందుకు బయటకొచ్చాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న దుండగులు అభయ్‌ను కిడ్నాప్‌ చేశారు. అభయ్‌ ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు సాయంత్రం 5గంటల సమయంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు... అభయ్‌ కోసం వెతకడం మొదలుపెట్టారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో  కిడ్నాపర్ల నుంచి అభయ్ తండ్రికి ఫోన్‌ వచ్చింది. త్రరూ. 10 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు దుండగులు ఫోన్ చేశారు. తండ్రి అందుకు నిరాకరించడంతో అభయ్ ముక్కులో పేపర్లు కుక్కి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్టు సమాచారం.

మరోవైపు అభయ్‌ తల్లిదండ్రులతో నిందితుల ఫోన్‌ సంభాషణ ఆడియో టేపులు విడుదలయ్యాయి. కిడ్నాపర్లు అభయ్‌ తండ్రికి ఫోన్‌ చేసి 10 కోట్లు డిమాండ్‌ చేశారు. అయితే రాత్రికి రాత్రే ఐదు కోట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. లేకుంటే అభయ్‌ ప్రాణాలతో దక్కడని బెదిరించాడు. కనీసం 5 కోట్లు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తన దగ్గర లేదని, 20 లక్షల వరకైతే ఇవ్వగలనని అభయ్‌ తండ్రి ప్రాధేయపడ్డాడు.

అయినా కిడ్నాపర్లు కనికరించలేదు.. డబ్బు తీసుకుని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రావాలని చెప్పి కిడ్నాపర్‌ ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కిడ్నాపర్లు అభయ్ను హతమార్చి, మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా కేఫ్‌ వద్ద వదిలి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు....కాటన్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేసి చూడడంతో మృతదేహం బయటపడింది. కాగా అభయ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌