సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెన్ను కావాలని వచ్చి ....
Published on Sun, 01/03/2016 - 02:02
కాటేదాన్: పెన్ను కొనే నెపంతో కిరాణా షాపునకు వచ్చిన ఇద్దరు దుండగులు షాపు నిర్వాహకురాలి పుస్తెలతాడును తెంచుకొని పారిపోయారు. మైలార్దేవ్పల్లి క్రైం ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్నగర్ బస్తీలో గౌలికర్ ప్రమీలా, బన్సీలాల్ దంపతులు కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో వీరి షాపు వద్దకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్లేని పల్సర్ బైక్పై వచ్చారు. పెన్ను కావాలని వారు అడగడంతో షాపులో ఉన్న ప్రమీల వారికి పెన్ను అందించి వెనుకకు తిరిగేసరికి ఆమె మెడలోని 3.5 తులాల పుస్తెలతాడును తెంచుకొని బైక్పై పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags