Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
స్పీకర్ పై వీగిపోయిన అవిశ్వాసం
Published on Tue, 03/15/2016 - 16:20
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. సభ్యులు సభలో నిలబడి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కోరగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అందరూ నిలబడ్డారు.
అవిశ్వానికి వ్యతిరేకంగా అధికార టీడీపీ, బీజేపీ సభ్యులు లేచి నిలబడ్డారు. అవిశ్వాసానికి మద్దతుగా ఎంతమంది నిలబడ్డారు, వ్యతిరేకంగా ఎంతమంది నిలబడ్డారనే దాన్ని అసెంబ్లీ అధికారులు నమోదు చేశారు. అవిశ్వాసానికి మద్దతుగా 57 ఓట్లు, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. తటస్థులు ఎవరైనా ఉంటే నిలబడాలని కోరగా ఎవరూ నిలబడలేదు. దీంతో స్పీకర్ పై అవిశ్వాసం వీగిపోయినట్టుగా డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. తర్వాత స్పీకర్ కోడెలను సభను ఆహ్వానించారు.
Tags