amp pages | Sakshi

బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్

Published on Fri, 09/02/2016 - 01:09

- ప్రభుత్వ ఉద్యోగుల క్లెయిమ్‌లలో అత్యధికం ఈ వ్యాధివే..
- మొత్తం 40వేల కేసుల్లో క్యాన్సర్ బాధితులు 12 వేలు..
- 80 శాతం బాధితులు మహిళలు..
- రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అధికం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో కేన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అధికంగా దీని బారిన పడుతున్నట్లు తేలింది. వైద్యవిద్యా శాఖకు వస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులను బట్టి చూస్తే అత్యధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొంది ఆ తర్వాత ఆ డబ్బును రీయింబర్స్ చేసుకోవడం కోసం వైద్య విద్యా సంచాలకులకు పరిశీలనకు దరఖాస్తులు పంపిస్తారు.

ఇలాంటి దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఏటా 40 వేలకుపైగా వస్తున్నాయి. ఇందులో 12 వేలు కేవలం క్యాన్సర్‌వే ఉండటం గమనార్హం. ఈ 12వేల కేసుల్లో 8 వేల మంది మహిళా ఉద్యోగులే ఉన్నారు. ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో వైద్యం పొందిన వారు ఉన్నారు. ఇక పురుషుల్లో ఓరల్ క్యాన్సర్ అంటే గుట్కాలు, కిల్లీలు, పాన్‌మసాలాల కారణంగా నోటి క్యాన్సర్ బాధితులు, ఊపిరితి త్తుల క్యాన్సర్ బాధితులు 4వేల మంది ఉన్నా రు. వయసుల వారీగా చూస్తే మహిళల్లో ఎక్కు వ మంది 40 నుంచి 50 ఏళ్లలోపు వారున్నారు. పురుషుల్లో 45 ఏళ్లు పైబడిన వారున్నారు.

 గుండె, మూత్రపిండాల వ్యాధులూ అధికం
 మొత్తం 40 వేల మందిలో 12 వేల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉండగా.. మూత్ర పిండాల వ్యాధులు, గుండె జబ్బు బాధితులు తర్వాతి స్థానంలో ఉన్నారు. ఏటా 8 వేల నుంచి 9 వేల వరకూ కిడ్నీ జబ్బులతోనూ, 10 వేల గుండె జబ్బుల బాధితులు దరఖాస్తులూ ఇక్కడకు వస్తున్నాయి. కిడ్నీ, గుండె జబ్బుల బాధితుల్లో 15 శాతం మహిళలుండగా, 85 శాతం పురుషులున్నారు. ఇక గుండె జబు బాధితుల్లో 40 ఏళ్లలోపు వయసున్న వారే అధికం. రాష్ట్రంలో మధుమేహ వ్యాధి అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూండటంతో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. వీరిలో 50 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఉన్నారు. వీళ్లందరూ డయాలసిస్ దశలో చికిత్స పొందుతున్న వారే. క్యాన్సర్, గుండె, మూత్రపిండాల వ్యాధులకు చెందిన వారే 30 వేలుండగా, మిగతా వ్యాధులతో చికిత్స పొంది దరఖాస్తు చేసుకున్న వారు 10 వేల మంది. దీన్నిబట్టి ఈ మూడు జబ్బుల తీవ్రత ఏంటో అర్థమైపోతుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌