amp pages | Sakshi

సంప్రదాయ పద్ధతులే మేలు

Published on Wed, 02/24/2016 - 03:22

♦ పర్యావరణ పరిరక్షణపై ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మల్లేశ్
♦ సీజీఆర్ సదస్సులో పర్యావరణ రక్షణకు వక్తల సూచనలు
 
 సాక్షి, హైదరాబాద్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సంప్రదాయంగా వస్తున్న పాత పద్ధతులను అవలంభించడమే మేలని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్ అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) మంగళవారం జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు పూర్తిగా వాడేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్ తరాల వారికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. నష్టమేనని తెలిసినప్పటికీ పర్యావరణానికి హాని తలపెడుతున్నామని, పెరుగుతున్న కాలుష్యం ఫలితంగా భవిష్యత్తులో ఆక్సిజన్ సిలెండర్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పర్యావరణ పరిరక్షణ పట్ల యువతకు దిశానిర్ధేశం చేసే బాధ్యత అధ్యాపకులపై ఉందని మల్లేశ్ అన్నారు. భవిష్యత్ తరాలు మనుగడ సాధించాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి అన్నారు. వాతావరణంలో మార్పుల కార ణంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటున్నాయన్నారు. ప్రసార మాధ్యమాల్లోనూ రాజకీయ అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని పర్యావరణ అంశాల కు ఇవ్వడం లేదన్నారు.

ఆ అంశాల పట్ల ప్రజల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్నది కనుకనే, విభిన్న రంగాలకు చెందిన నిపుణులను ఈ సదస్సుకు ఆహ్వానించామని ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తమ్‌రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కనుకనే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని స్థాయిల్లో పర్యావరణం సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వు లు జారీచేసిందన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు లీలా లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన సమాజమే లక్ష్యంగా సీజీఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీబీఐటీ చైర్మన్ మాలకొండారెడ్డి, పర్యావరణ నిపుణులు సురేశ్‌లాల్, డాక్టర్ నర్సింహారెడ్డి, ప్రసన్నషీల, విజయలక్ష్మి, ప్రియకుమారి, కృష్ణారెడ్డి, అక్తర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)