అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థులకు అసౌకర్యం కలగనివ్వం: మంత్రి కడియం
Published on Sun, 05/15/2016 - 07:43
హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. 2.46 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నట్లు ఆయన తెలపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 'క్యూ' సెట్ ప్రశ్నాపత్రం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఇంజినీరింగ్ పరీక్షకు 276 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసు, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మెడికల్, అగ్రికల్చర్ ఎగ్జామ్ కు 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
#
Tags