అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పార్టీ వీడే ప్రసక్తే లేదు
Published on Thu, 05/12/2016 - 03:30
♦ కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరు
♦ టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం సంక్షోభంలో పడటమే కాకుండా, రైతన్నపై కరువు కోరలు చాస్తుంటే, మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరు సాగించడమే తమ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. రమణ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరువు సహాయక చర్యల్లో వైఫల్యం చెందడమే కాక, అవకతవకల జల విధానం, మితిమీరిన అవినీతికి మారుపేరుగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ పబ్బం గడుపుతోందన్నారు. ఎంతో బాధ్యతాయుతమైన పార్టీ అధ్యక్ష పదవిని, గౌరవాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీనీ వీడే ప్రసక్తి లేదని రమణ స్పష్టం చేశారు.
#
Tags