amp pages | Sakshi

ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్న చంద్రబాబు

Published on Sat, 10/29/2016 - 02:05

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపాటు
 
 సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది అభివృద్ధి మంత్రం.. చేసేది అవినీతి తంత్రమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తనను ప్రశ్నించేవాళ్లపై, అసహనంగా ఉన్న ప్రజలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్న ప్రజా సంఘాలపై, తన అవినీతిపై అనునిత్యం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై భరించలేని తత్వంతో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అదే అంశాన్ని ఆయుధంగా చేసుకున్నారని చెప్పారు. ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను, తమను వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ లోబరుచుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.

 వ్యతిరేకించే వారందరిపైనా నిఘా: ‘‘1885,1971 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. కేంద్ర హోంశాఖ అనుమతితో దేశద్రోహుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేస్తారు. కానీ, చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరి మీదా నిఘా వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంతోపాటు పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు, పత్రికల యజమానులు, తనను వ్యతిరేకించే విలేకరులు, ఆఖరికి సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం చంద్రబాబు ట్యాప్ చేయిస్తున్నారు.  చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే తామేమీ ఫోన్లను ట్యాప్ చేయలేదని స్పష్టంగా ప్రకటించాలి. లేకపోతే ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. ప్రజా సంఘాలను కలుపుకుని సర్కారు తీరుపై పోరాడుతాం’’ అని భూమన హెచ్చరించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)