రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రైవేట్ వైద్యుల మరో ఘరానా మోసం!
Published on Mon, 03/02/2015 - 21:23
హైదరాబాద్: ప్రైవేట్ వైద్యుల ఘరానా మోసాలు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అనారోగ్యం కారణంగా ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు మోసపోయిన ఘటన నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ జంట వద్ద ఆరోగ్య సమస్యలతో ఎల్బీ నగర్ లోని ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయిస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మాయ మాటలు చెప్పారు.
దీనిలో భాగంగానే వారి వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే దీనిపై మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన డాక్టర్లు రాంజీ, నాగభూషణంలుగా తెలుస్తోంది.
#
Tags