వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ
Published on Wed, 07/12/2017 - 15:45
హైదరాబాద్: నగరంలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. వందల మంది నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నగరంలోని మాదాపూర్ కేంద్రంగా ఏర్పాటైన సాఫ్ట్వేర్ కంపెనీ 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి చివరకు వారికి జీతలు చెల్లించకుండా చేతులెత్తేసింది.
మాదాపూర్ సైబర్ గేట్వేలో serinux పేరుతో కంపనీ ఏర్పాటైంది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారు కంపెనీ ప్రతినిధులు. అనంతరం నెలలు గడుస్తున్న వారికి జీతం ఇవ్వక పోవడంతో ఉద్యోగులు నిలదీశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గత రెండేళ్లలో నగరంలో 9 సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడగా 1000 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. కంపెనీ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు బ్యాక్ డోర్ నియామకాలు చేసే కంపెనీలలో చేరవద్దని పోలీసులు కోరుతున్నారు.
#
Tags