అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు'
Published on Thu, 08/06/2015 - 13:47
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు పడకుండా ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని ఆయన గురువారమిక్కడ ఆరోపించారు. విపక్షాల ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెబుతామని తలసాని స్పష్టం చేశారు.
అవినీతికి అలవాటు పడిన పార్టీలు ఇప్పుడే అదే దృష్టితో చూస్తున్నాయని, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల అవినీతిలో ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు. గతంలో ఉస్మానియా ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడని పార్టీలు, వ్యక్తులు...ప్రస్తుతం తమ యత్నాలు అడ్డుకోవాలని చూస్తున్నారని తలసాని మండిపడ్డారు.
#
Tags