వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంఆర్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన లక్ష్మారెడ్డి
Published on Thu, 08/17/2017 - 10:53
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి తట్టు (మీజిల్స్), రూబెల్లా వ్యాధుల నివారణ కోసం చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగరంలోని రాజ్ భవన్ స్కూల్ లో ఎంఆర్ వ్యాక్సిన్ ను వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసు వారికి ఈ టీకా వేయించాలని తెలిపారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ వేశారన్నారు.
రాష్ట్రంలో 90 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. స్కూళ్లలో 60 లక్షల మంది పిల్లలు ఉన్నట్లు ఆయన చెప్పారు. దీనిపై ఎలాంటి అపోహలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 5 వారాల పాటు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన తెలియజేశారు. రెగ్యులర్ వ్యాక్సిన్ తో పాటు ఎంఆర్ కూడా తీసుకోవాలని ఆయన చెప్పారు.
#
Tags