అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రుణమాఫీ నిధులు విడుదల చేయాలి: చాడ
Published on Tue, 08/23/2016 - 01:54
సాక్షి, హైదరాబాద్ : రైతులకు (2015-16) పంట నష్టపరిహారం అందించాలని, రుణమాఫీ నిధులను విడుదల చేయాలని, వ్యవసాయ రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. కరువు సాయం కింద కేంద్రం విడుదల చేసిన రూ.721 కోట్లు ఏమయ్యాయని, ఆ నిధులకు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ కలిపి రైతులకు ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ప్రశ్నించారు.
వ్యవసాయ రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. అటు కేంద్ర సహాయం, ఇటు ఇన్పుట్ సబ్సిడీ అందక, రుణమాఫీ జరగక రైతుపై ముప్పేట దాడి జరుగుతోందని.. సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
#
Tags