amp pages | Sakshi

కలాం మార్గంలో నడవడమే ఉత్తమ శ్రద్ధాంజలి

Published on Wed, 07/27/2016 - 14:23

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రధమ వర్దంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో కలాం మాటలను గుర్తుచేసుకున్నారు. 'మనల్ని బలంగా తయారుచేయటం కోసమే కష్టాలు వస్తాయి అని కలాంగారు చెప్పారు. తన ఆలోచనలు, చర్యలతో ఆయన దేశాన్ని బలోపేతం చేశారు. అతడి మార్గంలో నడవడమే ఉత్తమమైన శ్రద్ధాంజలి' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.