అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాంబు దాడుల్లో 45 మంది మృతి
Published on Sun, 01/31/2016 - 18:28
డమాస్కస్: సిరియా మరోసారి బాంబు దాడులతో అట్టుడికింది. రాజధాని డమాస్కస్ దక్షిణ ప్రాంతంలోని సయిదా జీనాబ్ ప్రార్థనా మందిరం సమీపంలో జరిగిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 45 మంది మృతి చెందినట్లు సిరియన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
శక్తిమంతమైన పేలుళ్లు జరిగిన ప్రాంతంలోని సమీప భవనాలు, కార్లు ధ్వంసమైన దృశ్యాలను సిరియన్ స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. సిరియా ప్రభుత్వ వర్గాలు ప్రతిపక్షాలతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
#
Tags