అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పేలిన దశాబ్దాల నాటి బాంబు
Published on Fri, 08/18/2017 - 16:30
- ఆరుగురు మృతి
హనోయి: దశాబ్దాల క్రితం నాటి బాంబు పేలి ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వియత్నాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1970 లలో అమెరికా, వియత్నాం మధ్య యుద్ధం సందర్భంగా అమెరికా వైమానిక బలగాలు వేలకొద్దీ బాంబులను వియత్నాంపై విసిరాయి. వీటిలో కొన్ని పేలిపోగా మరికొన్ని ఇంకా బయటపడుతున్నాయి. ఇటువంటి ఓ బాంబు ఖాన్హ్హో ప్రావిన్స్లోని టా లువాంగ్ గ్రామానికి చెందిన ఓ రైతు భూమి దున్నుతుండగా దొరికింది. ఆ రైతు కుటుంబసభ్యులు దానిని ఇంటికి తీసుకెళ్లి ఇనుప వస్తువులను వేరు చేసేందుకు ప్రయత్నించగా బాంబు ఒక్కసారిగా పేలింది.
దీంతో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ఇల్లు కుప్పకూలింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 1975 సంవత్సరంలో అమెరికా, వియత్నాం యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో 42 వేల మంది చనిపోగా 62 వేల మందికి పైగా గాయపడ్డారు. యుద్ధ సమయంలో అమెరికా విసిరిన బాంబులు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో, రైతులు పొలాలు దున్నే సమయంలో బయటపడుతూనే ఉన్నాయి.
కొన్ని సార్లు ఆ బాంబులు పేలి ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. అయితే, కొన్ని సార్లు రైతులు ఈ బాంబుల నుంచి పేలుడు పదార్ధాలను సేకరించి మత్స్యకారులకు విక్రయిస్తుంటారు. ఇనుపసామగ్రిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక్కోసారి వారి ప్రాణాంతకంగా మారుతోంది.
#
Tags