సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం
Breaking News
ఏ గ్రూపు రక్తమైనా ఇక ఒక్కటే!
Published on Thu, 04/30/2015 - 14:18
టొరాంటో: అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన గ్రూపు రక్తం దొరక్క ఎంతోమంది రోగులు, ముఖ్యంగా యాక్సిడెంట్ కేసుల్లో క్షతగాత్రులు మృత్యువుబారిన పడుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి పరిస్థితిని అధిగమించి ఎవరికైనా ఎవరి రక్తమైనా (ఏ గ్రూపు రక్తమైనా) సరిపోయాలా....ఏ దాత నుంచి తీసుకున్న రక్తాన్నైనా యూనివర్సల్ గ్రూప్ రక్తంగా మార్చడంలో సైంటిస్టులు విజయం సాధించారు. బ్రిటన్లోని కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ ఎంజైమ్ను సృష్టించారు. ఇది ఏ గ్రూపు రక్తాన్నైనా యూనివర్సల్ గ్రూప్ రక్తంగా మార్చేస్తుంది. ‘ఓ’ గ్రూపు రక్తాన్ని మాత్రమే యూనివర్సల్ గ్రూప్ రక్తంగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ రక్తాన్ని ఏ గ్రూప్ వారికైనా ఎక్కించవచ్చు.
ఈ గ్రూప్ రక్తం అవసరమవుతున్న స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. పైగా ఓ గ్రూపులో ఓ నెగిటివ్, పాజిటివ్ అనే రెండు రకాలు ఉంటాయి. ఆ గ్రూపు రక్తం వారికి మాత్రం ఆ గ్రూపు రక్తాన్ని మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం గ్రూప్లతో సంబంధం లేకుండా ఓ మనిషి రక్తం మరో మనిషికి సరిపడేలా చేయాలనే ఉద్దేశంతో ఆ దిశగా శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ప్రతి వ్యక్తి రక్తంలో యాంటిజెన్స్ ఉంటాయన్న విషయం తెల్సిందే. అంటే ఈ యాంటీజెన్స్ బ్యాక్టీరియా, వైరస్లాంటివే కాకుండా ఏ ఫారిన్ బాడీని ర క్తంలోనికి అనుమతించదు. ఏ, బీ రక్తం గ్రూపుల్లో ఈ యాంటిజెన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగానే ఇతర గ్రూపుల రక్తాన్ని ఏ, బీ గ్రూపుల రక్తం శరీరంలోనికి అనుమతించదు.
ఇప్పుడు శాస్త్రవేత్తలు సృష్టించిన కొత్త ఎంజైమ్ అన్ని గ్రూపుల రక్తంలోని యాంటిజెన్స్ను సమర్థంగా అరికడతాయి. తాము సృష్టించిన ఈ కొత్త ఎంజైమ్ సమర్థంగా పనిచేస్తున్నట్టు తమకు ప్రయోగాల్లో తేలిందని, ఓ ఐదు తరాలపాటు దీన్ని ఉపయోగిస్తే ఎంజైమ్ పనితీరు 170 రెట్లు పెరుగుతుందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త జయచంద్రన్ వివరించారు. రక్తంలో నుంచి యాంటిజెన్స్ లేదా షుగర్స్ను అరికట్టడం లేదా తొలగించడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం వారివద్ద సమాధానం లేదు. ఆ దిశగా ఇంకా ప్రయోగాలు జరగాల్సి ఉంది.
Tags