amp pages | Sakshi

భారతీయులకు శుభవార్త

Published on Wed, 01/31/2018 - 09:55

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన భారతీయులకు శుభవార్త కానుంది. ప్రతిభ ఆధారంగానే ప్రవేశం కల్పించాలని ట్రంప్‌ ప్రకటన చేశారు. అలా చేయడం ద్వారా మాత్రమే అమెరికాను ప్రథమ స్థానంలో ఉంచగలమని స్పష్టం చేశారు. అలాగే, లాటరీ వీసా వ్యవస్థకు తాను ముగింపు పలకబోతున్నానని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, నిరంతర వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్‌ తాజాగా ప్రసంగించారు. ఈ ప్రసంగానికి గతంలో కాన్సాస్‌లో జాతి విధ్వేష కాల్పుల్లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్‌ భార్య సునయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ విబేధాలను పక్కన పెడుతూ అందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. ఇటీవల సంభవించిన విపత్తు మన భూభాగాన్ని తుడిచిపెట్టిందని అన్నారు.

'అమెరికాలో శాశ్వత పౌరసభ్యత్వం ఇచ్చేందుకు అందించే గ్రీన్‌ కార్డులను ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలి. ఎందుకంటే అమెరికాను ముందు వరసలో ఉంచడానికి అదొక్కటే మార్గం. మెరిట్‌ ఆధారిత వలస విధానం ప్రారంభించడానికి ఇదే సమయం. ఎవరైతే అధిక నైపుణ్యాలు కలిగి ఉన్నారో, ఎవరు మన సమాజానికి మంచి సేవలను అందించగలరో, ఎవరు మన దేశాన్ని ప్రేమించి గౌరవిస్తారో వారికి మాత్రమే మనం గ్రీన్‌ కార్డులు ఇవ్వాలి' అని ట్రంప్‌ చెప్పారు. మెరిట్‌ ఆధారిత వలస వ్యవస్థను ట్రంప్‌ తీసుకొస్తే అది ఎక్కువమంది భారతీయులకు మేలును అందిస్తుంది. అయితే, వారి కుటుంబాలను విస్తరించుకునేందుకు మాత్రం అడ్డుకునే అవకాశం ట్రంప్‌ ప్రకటించిన విధానంలో ఉండనుంది. ఎందుకంటే చైన్‌ మైగ్రేషన్‌ విధానం ఉండబోదని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ ప్రసంగాన్ని డెమొక్రాట్స్‌ బహిష్కరించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)