amp pages | Sakshi

మసీదులో 235 మంది ఊచకోత

Published on Fri, 11/24/2017 - 21:10

ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడి నెత్తుటేర్లు పారించారు. మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అమాయకులపై గుళ్ల వర్షం కురిపించి 235 మంది నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ముందు మసీదులో బాంబు పేల్చి, అనంతరం భయంతో పారిపోతున్న వారిపై నలువైపుల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇస్లామిక్‌ దేశం ఈజిప్ట్‌లోని సమస్యాత్మక ఉత్తర సినాయ్‌ ప్రాంతంలోని అల్‌–అరిష్‌ పట్టణంలో ఉన్న అల్‌–రౌదా మసీదులో ఈ ఘోరం చోటు చేసుకుంది. సాధారణంగా ఐఎస్‌ ఉగ్రసంస్థ ద్రోహులుగా పరిగణించే సూఫీలు ఈ మసీదులో ప్రార్థనలు జరుపుతారని స్థానికులు తెలిపారు.

కైరో: ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అల్‌ అరిష్‌ పట్టణంలోని మసీదులో శుక్రవారం మధ్యాహ్నం పవిత్ర ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై ఉగ్రవాదులు బాంబులు, భారీ ఆయుధాలతో దాడి చేశారు. ఆ దేశం గతంలో ఎన్నడూ చూడని రీతిలో దాదాపు 235 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 109 మందిని గాయపరిచారు. ఈ దారుణ ఘటనతో  మసీదు ప్రాంగణమంతా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు,  క్షతగాత్రులు, రక్తపు ధారలతో భీతావహంగా మారింది.

నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు తొలుత మసీదులోని చిన్నారుల సంరక్షణ కేంద్రం వద్ద బాంబు పేల్చారనీ, ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీస్తున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారని ఈజిప్ట్‌ అధికార వార్తా సంస్థ ‘మెనా’ వెల్లడించింది. ఇది ఉగ్రదాడేనని ఈజిప్ట్‌ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. గాయపడిన వారిని వైద్యశాలలకు తరలించేందుకు 50కిపైగా అంబులెన్సులు ఘటనాస్థలం వద్దకు చేరుకున్నాయి.  

సూఫీలే లక్ష్యంగా..
సూఫిజం మద్దతుదారులు, ఈజిప్ట్‌ భద్రతాదళాలను సమర్థిస్తున్నవారు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రసంస్థ కూడా సూఫీలను ఇస్లాం ద్రోహులుగా భావిస్తుంది. అయితే, ఈ దాడికి ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యతను ప్రకటించుకోలేదు. దాడి చేసిన ఉగ్రవాదులు ఏమయ్యారన్న దానిపై కూడా సమాచారం లేదు. అయితే దాడి జరిగిన తీరును బట్టి ఇది ఐఎస్‌ ఉగ్రసంస్థ పని అయ్యుండొచ్చని భావిస్తున్నారు.

అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌–సిసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి దాడి తీవ్రత, ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈజిప్ట్‌ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు హోస్ని ముబారక్‌ను పదవి నుంచి దింపివేసిన తర్వాత 2011 జనవరి నుంచి ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ఇస్లాంవాది అయిన మరో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ 2013లో పదవి కోల్పోయాక ఈ ప్రాంతంలోని పోలీసులు, సైన్యం లక్ష్యంగా ఉగ్రవాదులు మరింత పేట్రేగిపోయారు.

అప్పటి నుంచి ఇప్పటికి 700 మందికిపైగా భద్రతా సిబ్బంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది తొలి నుంచీ ఈజిప్ట్‌లో ఉగ్రదాడులు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మే 26న క్రైస్తవులను ఎక్కించుకుని వెళ్తున్న ఓ బస్సుపై జరిగిన దాడిలో 28 మంది మరణించారు. ఏప్రిల్‌ 9న కూడా అలెగ్జాండ్రియా, టాంట నగరాల్లోని చర్చిల వద్ద జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 46 మంది
చనిపోయారు.

పిరికిపందల చర్య: ట్రంప్‌
దాడిలో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతాపం తెలిపారు. దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించిన ట్రంప్‌ ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని ఇక భరించలేదు. మనం మన సైన్యాలతోనే వారిని ఓడించాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘ఉగ్ర’ పోరుకు మా మద్దతు: మోదీ
దాడిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘ఈ ఆటవిక ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు దేశం తరఫున సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్‌ మద్దతుగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈజిప్టులో భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య కూడా దాడిని ఖండించారు.  

ప్రతీకారం తీర్చుకుంటాం: సిసీ
ఉగ్రవాదులపై తమ ‘క్రూర సైన్యం’ ద్వారా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌–సిసీ శపథం చేశారు. ఇలాంటి దాడుల వల్ల ఉగ్రవాదంపై పోరాటంలో తమ బలం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.  


Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)