అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కలిసి తింటే కలదు ఆరోగ్యం!
Published on Thu, 04/21/2016 - 10:37
న్యూయార్క్: కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. తినే రుగ్మత(అతిగా తినడం.. లేదంటే అసలు తినకపోవడం) బారిన పడకుండా ఉండడానికి, భవిష్యత్తులో స్థూలకాయులుగా మారే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఈ పద్ధతే ఉత్తమమైనదని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.
దాదాపు 200 కుటుంబాలపై అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, బంధువులు.. ఇలా అందరితో కలిసి కూర్చుండి తినడమే మేలంటున్నారు. ఇలా తినేటప్పుడు పిల్లల ఆహార అలవాట్లను తల్లిదండ్రులు దగ్గరగా పరిశీలిస్తారని, ఒకరు కాకపోయినా మరొకరు వారి తీరును పరిశీలించి సరిదిద్దడమే ఇందుకు కారణమని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన బార్బారా తెలిపారు.
#
Tags