amp pages | Sakshi

భారత్‌లో మైనారిటీల భద్రతపై సంఘర్షణ

Published on Fri, 05/02/2014 - 04:15

అమెరికా ప్రతినిధుల సభ కమిటీ నివేదిక
రాజకీయ అవినీతి, చిత్తశుద్ధి లోపం వల్ల మైనారిటీలపై నేరాలు
బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని వెల్లడి

 
 వాషింగ్టన్: లౌకిక దేశంగా, విభిన్న మతాల ప్రజలు ఐక్యంగా ఉండే దేశంగా పేరున్నా... భారతదేశంలో మైనారిటీల రక్షణ, భద్రత కోసం, సరైన న్యాయం కోసం సంఘర్షణ జరుగుతోందని అమెరికా పేర్కొంది. రాజకీయంగా చిత్తశుద్ధి లోపించడం వల్ల.. రాజకీయ అవినీతి వల్ల, ప్రభుత్వ అధికారులే మతపరంగా వివక్ష చూపించడం వల్ల వారిపై నేరాలు జరిగినప్పుడు.. ఏ మాత్రం న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ స్థాయిలో మత స్వేచ్ఛ అంశంపై ఏర్పాటైన అమెరికా ప్రతినిధుల (కాంగ్రెస్) సభా కమిటీ (యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలీజియస్ ఫ్రీడమ్-యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) ఈ మేరకు గురువారం ఒక వార్షిక నివేదికను విడుదల చేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించడానికి.. ఈ కమిటీయే ప్రధాన కారణం కావడం గమనార్హం.
  మత స్వేచ్ఛకు ప్రత్యక్షంగా, పరోక్షంగా విఘాతం కలిగించిన వ్యక్తులను దేశంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (ఐఆర్‌ఎఫ్‌ఏ) ఉపయోగపడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది.
  అయితే దానిని కేవలం ఒకసారి మాత్రమే ప్రయోగించడానికి అవకాశం ఉందని, దీనిని సవరించాలని కమిటీ అమెరికా ప్రభుత్వానికి సూచించింది.
  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మోడీ తరహాలో మత స్వేచ్ఛకు విఘాతం కలిగించిన వారి జాబితాను అమెరికా హోం, విదేశీ మంత్రిత్వ శాఖలకు అందజేశామని.. దీని ఆధారంగా వీసా నిషేధిత వ్యక్తుల జాబితాను పెంచాలని కోరింది.
  భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మత స్వేచ్ఛ అంశంపైనా దృష్టి పెట్టాలని అక్కడి ప్రభుత్వానికి సూచించింది. మత పరమైన హింస, వివక్షపై సమర్థవంతంగా స్పందించేలా, ఉన్నత స్థాయి ప్రమాణాలు నెలకొల్పేలా పోలీసుశాఖను బలోపేతం చేసేలా ప్రోత్సహించాలని పేర్కొంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)