amp pages | Sakshi

యూకేలో భారత సంతతి వైద్యుడి మృతి

Published on Sat, 05/30/2020 - 09:41

లండన్‌: కరోనా సంక్షోభ సమయంలో యూకేలో ప్రజలకు సేవ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యుడు హోటల్‌ గదిలో మృతి చెందాడు. వివరాలు.. డాక్టర్‌ రాజేష్‌ గుప్తా ఆగ్నేయ ఇంగ్లండ్‌ బెర్క్‌షైర్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ట్రస్ట్‌ అధ్వర్యంలో నడుస్తున్న వెక్షం పార్క్ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌ కన్సల్టెంట్‌‌(మత్తుమందు)గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పేషంట్లకు వైద్యం చేస్తుండటంతో కుటుంబ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి సమీపంలోని ఓ హోటల్‌లో రాజేష్‌ గుప్తా ఒక్కరే ఉంటున్నారు.

ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రాజేష్‌ గుప్తా హోటల్‌ గదిలో మరణించాడు. అయితే ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ సందర్భంగా  ఫ్రిమ్లీ హెల్త్ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా సహోద్యోగి డాక్టర్‌ రాజేష్‌ గుప్తా సోమవారం మధ్యాహ్నం వరకు మాతో కలిసి కరోనా పేషంట్లకు వైద్యం చేశారు. విధులు ముగిసిన తర్వాత ఆయన బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు. తర్వాత ఆయన మరణించినట్లు తెలిసింది. రాజేష్‌ అద్భుతమైన కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, వంట బాగా చేస్తాడు. చాలా ఉత్సాహవంతడు. మంచికి మానవత్వానికి ప్రతీకలాంటి వాడు. అతను అనేక పుస్తకాలు రాశాడు.. ఇతరుల రచనలకు సహకరించాడు. అతడి ఆకస్మిక మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అతడిని చాలా మిస్‌ అవుతున్నాం’ అని ప్రకటనలో తెలిపింది.

జమ్మూలో ఉన్నత విద్యను అభ్యసించిన రాజేష్‌ గుప్తాకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ వార్త వారిని ఎంతో కుంగదీస్తుందని ఫ్రిమ్లీ హెల్త్ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్ ట్రస్ట్ తెలిపింది. ప్రస్తుతం రాజేష్‌ మృతికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సదరు ట్రస్టు పేర్కొంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)