amp pages | Sakshi

కరోనా మరణాల్లో చైనాను మించిన ఇటలీ

Published on Fri, 03/20/2020 - 04:22

రోమ్‌/బీజింగ్‌/వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మరణాల్లో ఇటలీ చైనాను మించిపోయింది. ఇటలీలో తాజాగా మరో 427 మంది చనిపోవడంతో ఫిబ్రవరి నుంచి ఈ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య 3,405 కు చేరుకుంది.  చైనాలో గురువారం నాటికి మరణాల సంఖ్య 3,245కు చేరుకుంది.  

చైనాలో కొత్త కేసే లేదు
కరోనా వైరస్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్న చైనాకి గొప్ప ఊరట లభించింది. వ్యాధి విస్తరించిన తర్వాత తొలిసారిగా బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. వూహాన్‌లో స్థానికంగా ఒకరికొకరికి సంక్రమించడాన్ని చైనా నిలువరించగలిగింది. చైనా పక్కా ప్రణాళికతో వైరస్‌పై యుద్ధం ప్రకటించి ఎక్కడికక్కడ అందరినీ నిర్బంధంలో ఉంచడంతో నెల రోజుల క్రితం రోజుకి వెయ్యి కేసులు నమోదయ్యే చోట ఇప్పుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  చైనాలో పరిస్థితులతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాపై విజయం సాధించడం దుర్లభం కాదన్న ఆశాభావం ఇతర దేశాలకు కలుగుతోంది. ఆసియాలో 3,400 పైగా మరణాలు నమోదయ్యాయి. ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌లలో అత్యధిక సంఖ్యలో కరోనా వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. స్పెయిన్‌లో మరణాలు 209 నుంచి 767కి పెరిగాయి.  (భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి)
 
అమెరికా వేల కోట్ల డాలర్ల ప్యాకేజీ
వైరస్‌ సృష్టించిన కల్లోలం నుంచి బయటపడేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అమెరికన్ల ఆరోగ్యం, ఆర్థిక భద్రత అన్న అంశాలే ప్రధానంగా వేలాది కోట్ల డాలర్ల సాయాన్ని అందించడానికి సంబంధించిన బిల్లుపై సంతకాలు చేశారు. ఫ్యామిలీస్‌ ఫస్ట్‌ కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ యాక్ట్‌ పేరుతో రూపొందించిన దీని ద్వారా కరోనా సోకిన వారికి పెయిడ్‌ సిక్‌ లీవ్‌ ఇస్తారు. కోవిడ్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఆహార పదార్థాలు, మందులు వంటి నిత్యావసరాల సాయం అందించడం వంటివి ఈ నిధుల నుంచి చేపడతారు. ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ, అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. కరోనా వైరస్‌ బారిన పడి ఇరాన్‌లో ఒక ఇండియన్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో 201 మంది భారతీయుల్ని ఇరాన్‌ నుంచి తీసుకువస్తున్నారు. మరోవైపు సింగపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 90 మంది భారతీయుల్ని విమానంలో తీసుకువస్తున్నారు.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)