ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
అంబులెన్స్తో ఆత్మాహుతి దాడి : 95 మంది మృతి
Published on Sat, 01/27/2018 - 15:46
కాబూల్ : అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ లో శనివారం భారీ పేలుడు చోటు చేసుకుంది. భారత రాయభార కార్యాలయానికి 400 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఓ దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడిలో 95 మంది మృతిచెందగా, 158మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు సార్లు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని తాలిబన్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్కు చెందిన ఆఫీసులు, స్వీడీష్ మిషన్స్, హై పీస్ కౌన్సిల్లు కూడా ఆత్మాహుతి దాడి జరిగిన స్థలానికి సమీపంలో ఉన్నాయి. ఆత్మాహుతి దాడికి ఓ అంబులెన్స్ను వాడినట్టు అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వహీద్ మజ్రూహ్ తెలిపారు. భారత రాయభార కార్యలయంలో పని చేస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Tags