రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేపాల్లో బస్సు ప్రమాదం.. 31 మంది మృతి
Published on Sun, 10/29/2017 - 03:26
కఠ్మాండు: నేపాల్లో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడటంతో 31 మంది మృత్యువాతపడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మమతా దేవీ ఠాకూర్ అనే భారతీయ మహిళ కూడా ఉంది. నేపాల్లోని ధాడింగ్ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. రాజ్బిరాజ్ నుంచి కఠ్మాండు వెళ్తున్న బస్సు ఘటబేసీలోని ఓ మలుపు వద్ద అదుపుతప్పి త్రిశూలీ నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో పడిన 16 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటివరకు 28 మృతదేహాలను వెలికితీశారు.
#
Tags