amp pages | Sakshi

చైనాకు దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చిన పాక్‌..!

Published on Thu, 11/16/2017 - 09:28

బీజింగ్‌: మిత్రదేశం చైనాకు పాకిస్థాన్‌ దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చింది. చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) విషయంలో ఆ దేశం ఆఫర్‌ను పాక్‌ తిరస్కరించింది. సీపీఈసీలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో డైమర్‌-భాష డ్యామ్‌ నిర్మాణానికి 14 బిలియన్‌ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా ముందుకురాగా.. పాక్‌ అందుకు నిరాకరించింది.

60 బిలియన్లతో చేపడుతున్న సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యామ్‌ను తామే కట్టుకుంటామని పాక్‌ నేరుగా చైనాకే చెప్పినట్టు తెలుస్తోంది. భారత్‌ తన ప్రాంతంగా పేర్కొంటున్న పీవోకేలో ఈ డ్యామ్‌ నిర్మిస్తుండటంతో.. ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం నిరాకరించాయి.

ఈ నేపథ్యంలో సీపీఈసీలో కీలకమైన ఈ డ్యామ్‌కు రుణమిచ్చేందుకు చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 5 బిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 14 బిలియన్‌ డాలర్లకు పెంచడం.. ఈ మేరకు రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు తీవ్రమైన షరతులు పెట్టడంతో పాక్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో చైనా షరతులు అంగీకరించడం ఎంతమాత్రం వీలు కాదని, అందుకే సొంతంగా ప్రాజెక్టు చేపడతామని పాకిస్థాన్‌ సర్కారు స్పష్టం చేసినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ దినపత్రిక ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వెల్లడించింది. డైమర్‌-భాషా డ్యామ్‌ విషయంలో చైనా పెడుతున్న షరతులు ఆమోదయోగ్యం కాదు.. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పాక్‌ వాటర్‌, విద్యుత్‌ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ముజామిల్‌ హుస్సేన్‌ స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టుపై పాకిస్థాన్‌ తాజా వైఖరి చైనాను బిత్తరపోయేలా చేసింది. తమను సంప్రదించకుండా ప్రాజెక్టును పాక్‌ ఇలా ఊహించని ఝలక్‌ ఇస్తుందని తాము అనుకోవడం లేదని చైనా వర్గాలు అంటున్నాయి. మొత్తం సీపీఈసీ ప్రాజెక్టును ప్రమాదంలో పడేసేలా     చైనా ఆఫర్‌ను పాక్‌ తిరస్కరించలేదని ఆ దేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రాజెక్టు యాజమాన్యం, నిర్వహణ, నిర్వహణ ఖర్చులు‌, భద్రత తామే చూసుకుంటామని చైనా కంపెనీలు పెడుతున్న షరతులు దేశ ప్రయోజనానికి భంగకరమని పాక్‌ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)