రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మనిషి మృతదేహాన్ని పీక్కుతిన్నాయి..
Published on Tue, 05/31/2016 - 16:46
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణప్రాంతంలో పోలీసులకు భయంకరమైన దృశ్యం కనిపించింది. మొసలి జాతికి చెందిన రెండు ఎలిగేటర్లు ఓ మనిషి మృతదేహాన్ని పీక్కుతింటున్నాయి. పోలీసులు అతికష్టమ్మీద వాటిని అక్కడ నుంచి తోలేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం రాత్రి జాలర్లు మొదట ఈ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. కొంతకాలంగా అక్కడ నీటిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వ్యక్తి ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉందని డేవీ పోలీస్ అధికారులు పాబ్లో కాస్తనెడా, కెప్టెన్ డేల్ ఈంగల్ చెప్పారు.
#
Tags