వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీలంక ప్రధానిగా రాజపక్స రాజీనామా
Published on Sun, 12/16/2018 - 04:55
కొలంబో: దాదాపు రెండు నెలలపాటు శ్రీలంకలో నెలకొన్న అస్థిర పరిస్థితులు తొలగిపోనున్నాయి. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించిన మహింద రాజపక్స ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ‘ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే సాధారణ ఎన్నికల్లోనూ సాధించడమే మా పార్టీ లక్ష్యం. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండేందుకు, అధ్యక్షుడు సిరిసేన మరో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా రాజీనామా చేశాను’ అని రాజపక్స చెప్పారు. దీంతోపాటు అధ్యక్షుడు సిరిసేన మనసు మార్చుకున్నారు. సోమవారం 30మందితో కూడిన కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుందని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్పీ )వర్గాలు తెలిపాయి.
#
Tags