amp pages | Sakshi

‘24 గంటలు ప్రయాణించి అక్కడికి వెళ్తున్నాం’

Published on Sat, 06/06/2020 - 18:47

ముంబై: పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు అనుగుణంగా వైద్య సిబ్బందిని ఏర్పాటుచేసుకునే దిశగా ముంబై ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రీన్ జోన్‌‌ కరోనా జిల్లాల్లో ఉన్న వైద్య సిబ్బందిని ముంబైకి రప్పిస్తోంది. ఈ క్రమంలో వైరస్‌ ప్రభావం తక్కువగా  వార్ధా జిల్లా నుంచి ఇప్పటికే 45 మంది డాక్టర్లు ముంబై వెళ్లి సేవలందిస్తున్నారు. అంధేరీలోని సెవన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో వారు విధుల్లో ఉన్నారు. వైద్యుల రవాణాకు బస్సు ఏర్పాట్లు చేశామని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. 24 గంటల బస్సు ప్రయాణం చేసి మరీ ముంబై వెళ్తున్నామని వార్ధాలోని మహాత్మా గాంధీ మెడికల్‌ సైన్సెస్‌ డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ఒకింత భయంగా ఉందని, అయినా స్వచ్ఛందంగా ఈ సేవలకు ముందుకొచ్చినట్టు తెలిపారు. 
(చదవండి: టిక్‌టాక్‌ స్టార్ ‌పై కేసు నమోదు)

కోవిడ్‌ బాధితులకు చికిత్స విషయంలో తమకు అవగాహన కల్పించారని  వార్ధాకు చెందిన మరో డాక్టర్‌ నీరజ్‌ పెథె చెప్పారు. వార్ధా, ముంబై పరిస్థితులు వేరువేరని అన్నారు. అయినప్పటికీ ఆపత్కాలంలో తమ సేవలు ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక వార్ధా డాక్టర్ల సేవలతో ముంబైలోని రెండు నెలలుగా విధుల్లో ఉన్న డాక్టర్లకు కొంత విశ్రాంతినివ్వొచ్చని వైద్యాధికారులు వెల్లడించారు. బీడ్‌, లాతూర్‌ జిల్లాల్లోని మెడికల్ కాలేజీ విద్యార్థులను సేవలను కూడా వినియోగించుకుంటామని బీఎంసీ అధికారులు తెలిపారు. వీళ్లందరి సేవలతో కరోనా బాధితులకు సేవలందించిన వైద్య సిబ్బంది 15 రోజులపాటు స్వీయ నిర్బంధంలో గడిపే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో 17,337 హెల్త్‌ కేర్‌ సిబ్బంది ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర వైద్య మంత్రి రాజేష్‌ తోపే ఇటీవల వెల్లడించడం గమనార్హం. వైద్య విద్యలోనూ 10 వేల ఖాళీ ఉన్నట్టు తెలిసింది. ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. 
(చదవండి: షోలాపూర్‌ మేయర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)