amp pages | Sakshi

ఫలితాలు, గణాంకాలు నడిపిస్తాయ్‌ !

Published on Mon, 01/15/2018 - 00:16

కీలక కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కూడా తగిన ప్రభావాన్ని చూపిస్తాయని వారంటున్నారు.  గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలకు సోమవారం మార్కెట్‌ ప్రతిస్పందిస్తుంది. పారిశ్రామికోత్పత్తి 17 నెలల గరిష్ట స్థాయి, 8.4 శాతానికి ఎగియగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా 17 నెలల గరిష్ట స్థాయి, 5.2 శాతానికి ఎగిశాయి.  

మార్కెట్‌ జోరు కొనసాగుతుంది... 
ఇక మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ వారంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, విప్రో, హిందుస్తాన్‌ యూనిలివర్, యస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, తదితర దిగ్గజ సంస్థల క్యూ3 ఫలితాలు వెలువడుతాయి. ప్రపంచ మార్కెట్ల జోరు, నిధుల ప్రవాహం బాగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్లో ప్రస్తుత సానుకూలతలు కొనసాగుతాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అయితే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, బడ్జెట్‌ సంబంధించిన సంకేతాలు మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్‌ ఫలితాలు అంచనాలకనుగుణంగానే వచ్చాయని, మార్కెట్‌ జోరు కొనసాగుతుందని అరిహంత్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అనితా గాంధీ చెప్పారు.  

విదేశీ పెట్టుబడులు ః రూ.5,200 కోట్లు 
భారత క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.  డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 1–12 మధ్యన విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.2,172 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.3,080 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. ఈల్డ్స్‌ ఆకర్షణీయంగా ఉండడం, కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉంటాయనే అంచనాలు దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఇవే కారణాల వల్ల విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వారంటున్నారు.  గత ఏడాది డెట్, ఈక్విటీల్లో కలిపి విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్