వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
హ్యాట్రిక్ కొట్టేశాడు : బన్నీ
Published on Mon, 08/19/2019 - 17:20
రీమేక్గా తెరకెక్కినప్పటికీ తెలుగు నెటీవిటీకి తగ్గట్టుగా మలిచి, కథనంలో మార్పులు చేసి తీసిన ‘ఎవరు’ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం.. అందర్నీ ఆకట్టుకుంటోంది. సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సందర్భంగా ఈ సినిమాపై సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘చిత్రబృందానికి కంగ్రాట్స్. నేను గత రాత్రే ఈ సినిమాను చూశాను. మర్డర్ మిస్టరీని అనేక మలుపులతో అద్భుతంగా తెరకెక్కించారు. కథనం, సాంకేతిక పరంగా ఈ చిత్రం చాలా బాగుంది. శేష్కు ఇది హ్యాట్రిక్ మూవీ.. కంటిన్యూస్గా మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ చక్కగా నటించారు. నిర్మాత పీవీపీ, దర్శకుడు వెంకట్ రామ్జీలకు కంగ్రాట్స్’అని తెలిపారు.
CONGRATULATIONS to the entire team of EVARU . @AdiviSesh @ReginaCassandra pic.twitter.com/PS08Kxrne4
— Allu Arjun (@alluarjun) August 19, 2019
Tags