నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కెమిస్ట్రీ కేక!
Published on Mon, 10/05/2015 - 23:41
మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’లో తమ కెమిస్ట్రీతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ల జోడి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారు. మలయాళంలో అన్వర్ రషీద్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని ‘జతగా’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి విడుదల చేయనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర విశేషాలను వెల్లడించారు. ‘‘లవ్, సెంటిమెంట్.. ఇలా అన్ని భావోద్వేగాలు ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నిత్యామీనన్, దుల్కర్ల జోడీ మళ్లీ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వండర్ఫుల్గా ఉంటుంది. గోపీ సుందర్ సంగీతం, సాహితీ సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.లోకనాథన్.
#
Tags