amp pages | Sakshi

‘ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’

Published on Sat, 02/29/2020 - 11:09

ముంబై: అతిలోక సుందరి శ్రీదేవి మరణించడం తన జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాల్లో ఒకటని బాలీవుడ్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా అన్నాడు. శ్రీదేవి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశాడు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి.. బాలీవుడ్‌ స్టార్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగిన మనీష్‌ మల్హోత్రా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనల గురించి ప్రఖ్యాత హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేజీతో పంచుకున్నాడు. తాను సంప్రదాయ పంజాబీ కుటుంబంలో జన్మించానని, బాలీవుడ్‌ మీద ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నాడు. 

‘‘సాధారణ కుటుంబంలో పుట్టిన నాకు... విదేశాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చదివేంత స్థోమత లేదు. అందుకే సొంతంగానే డిజైనింగ్‌ నేర్చుకున్నా. గంటల తరబడి స్కెచెస్‌ గీసేవాణ్ణి. మొదట్లో ఓ బొటిక్‌లో మోడల్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నా నెల జీతం రూ. 500. బాలీవుడ్‌ సినిమాలు చూస్తూ సమయం గడిపేవాడిని. ఇలా జీవితం సాగిపోతుండగా... 25 ఏళ్ల వయస్సులో నా కెరీర్‌ ప్రారంభమైంది. జూహీ చావ్లా సినిమాలో పనిచేసే అవకాశం లభించింది.

ఆ తర్వాత 1995లో విడుదలైన ‘రంగీలా’ సినిమాతో నా కెరీర్‌ మలుపు తిరిగింది. ఆ సినిమాకు బెస్ట్‌ క్యాస్టూమ్‌ డిజైనర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. ఇలా 30 ఏళ్ల కెరీర్‌లో ఎన్నెన్నో విజయాలు లభించాయి. ఇక నా జీవితంలో అత్యంత బాధపడిన, చెత్త విషయం ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’’ అని మనీష్‌ చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్‌ అగ్ర తారలందరికీ అభిమాన ​క్యాస్టూమ్‌ డిజైనర్‌గా ఉన్న మనీష్‌ మల్హోత్రా.. శ్రీదేవికి కూడా వ్యక్తిగత డిజైనర్‌గా ఉండేవారు. ప్రస్తుతం ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లకు కూడా దుస్తులు డిజైన్‌ చేస్తున్నారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)