amp pages | Sakshi

లంక టీజర్ రిలీజ్ చేసిన మారుతి

Published on Tue, 03/14/2017 - 11:38

టాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీ, పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తరువాత ఇప్పుడు ఓ హర్రర్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ సీనియర్ హీరోయిన్. రాశీ భర్త శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోలింగ్ రాక్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ నెలలో ఆడియో రిలీజ్ చేసి, వచ్చే నెల సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.