రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంక్రాంతికి సై
Published on Thu, 02/06/2020 - 05:46
దర్శకుడు రాజమౌళి తన పందెంకోళ్లను వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దించడానికి నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నట్లు ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత సినిమా వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ సినిమాను జనవరి 8, 2021 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ‘‘ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించాలని మా టీమ్ అందరం కష్టపడుతున్నాం. వాయిదా పడటం నిరుత్సాహం కలిగించే వార్తే కానీ మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని ‘ఆర్ఆర్ఆర్’ బృందం ట్వీటర్లో పేర్కొంది.
#
Tags