Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
దర్శకురాలిగా సెల్వరాఘవన్ భార్య
Published on Thu, 08/28/2014 - 23:52
కాదల్ కొండాన్ చిత్రంతో కోలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్కు నాంది పలికిన దర్శకుడు సెల్వరాఘవన్. ఆ తరువాత కడా 7/జి రెయిన్ బో కాలనీ, వంటి వైవిధ్య ప్రేమ కథా చిత్రాలతో అనూహ్య విజయాలను సాధించిన సెల్వరాఘవన్ ఇటీవల కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. ఆయ న ఇటీవల తెరకెక్కించిన ఇరండామ్ ఉలగం. ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో చాలా నిరాశ చెందాలనే చెప్పాలి.
అయితే ఇప్పుడాయన దర్శకత్వం బాధ్యతలను భార్య గీతాంజలి చేపట్టారన్నది తాజా వార్త. నటి సోనియా అగర్వాల్ నుంచి విడాకులు పొందిన తరువాత సెల్వరాఘవన్ తన వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసిన గీంతాం జలిని పెళ్లి చేసుకున్నారు. తాను మెగాఫోన్ పట్టనున్న విషయం గురించి సెల్వరాఘవన్ భార్య గీతాంజలి వివరిస్తూ తన భర్త దర్శకత్వం వహించిన మయక్కం ఎన్న, ఇరండాం ఉలగం చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానన్నారు.
సెల్వరాఘవన్ ప్రోత్సహించడంతో ఇప్పుడు మాలై నెరత్తు మయక్కం పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తన భర్త సెల్వరాఘవన్ కథ, కథనం మాటలు సమకూర్చినట్లు వెల్లడించారు. ఇది ఈ తరం యువత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నూతన తారాగణం నటించనున్న ఈ చిత్రానికి కెమెరామెన్ రంజి సహాయకుడు శ్రీధర్. చాయాగ్రహణ అందిస్తున్నారని తెలిపారు. షూటింగ్ను మూడు వారాల క్రితం చెన్నైలో ప్రారంభించి నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు నవ మహిళా దర్శకురాలు గీతాంజలి వెల్లడించారు.
Tags