వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
హీరోయిన్ సాయేషాకు షాక్ !
Published on Sat, 07/29/2017 - 08:12
చెన్నై: బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ అనూహ్య షాక్కు గురైంది. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్కుమార్ మనవరాలు ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు నటిగా మాతృభాషలో కాకుండా టాలీవుడ్లో ‘అఖిల్’ చిత్రం ద్వారా పరిచయమైంది. నాగార్జున తనయుడు అఖిల్ కథానాయకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం ఈ నవజంటను నిరాశపరిచింది. ఆ తరువాత కోలీవుడ్కు సాయేషాను దర్శకుడు విజయ్ పరిచయం చేశారు. జయంరవి హీరోగా నటించిన వనమగన్ చిత్రంలో సాయేషా నాయకిగా నటించింది. ఈ చిత్రం ఈ బ్యూటీకి మంచి పేరే తెచ్చిపెట్టింది.
దీంతో సాయేషా సైగల్ కోలీవుడ్ దృష్టి పడింది. వనమగన్ చిత్రం విడుదలకు ముందే ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లైరాజాలో నటించే అవకాశం వరించింది. వరుస అవకాశాలతో సాయేషా ఎగిరి గంతేసింది. కేరీర్ ఆరంభంలోనే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించడం నిజంగా లక్కే కదా! అదేవిధంగా ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ మధ్య చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో ఆడంబరంగానే జరిగింది. అంతేకాదు చిత్రం షూటింగ్ కూడా ఈ నెల మొదటి వారంలో రెండు రోజులు జరిగింది.
విశాల్, కార్తీ పాల్గొన్నారు. అలాంటిది సడన్గా కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం నుంచి విశాల్, కార్తీలిద్దరూ వైదొలిగినట్లు తెలిసింది. దీంతో ఆ చిత్రంలో నటించడానికి ఎంపికైన నటి సాయేషా పెద్ద షాక్కు గురైంది. ఈ చిత్రంతో ఎంతో ఊహించుకున్న ఈ భామ ఒక్కసారిగా డీలా పడిపోయిందట. విశాల్, కార్తీ కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం నుంచి వైదొలగడానికి వారు ఇతర చిత్రాల్లో బిజీగా ఉండడమేనట. అయితే నిర్మాత ఈ చిత్రం నుంచి డ్రాప్ కావడంలేదట. మరో నటులను ఎంపిక చేసి ప్రభుదేవా దర్శకత్వంలోనే నిర్మిస్తానంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
Tags