amp pages | Sakshi

‘ఆ లక్షణాలు కనిపించకపోవడం ఆందోళనకరమే’

Published on Sun, 05/31/2020 - 12:30

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 40,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇందులో 28.1 శాతం కేసులు ఎలాంటి లక్షణాలు కనిపించనివే కావడం గమనార్హం. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ పరిశోధన ఫలితాలను ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో (ఐజేఎంఆర్‌) శుక్రవారం ప్రచురించారు. లక్షణాలు కనిపించని వ్యక్తులతో కాంటాక్టు అయినవారిలో చాలామందికి కరోనా సోకినట్లు తేలింది. దేశంలో జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30 దాకా కరోనా సోకినవారిలో 25.3 శాతం మంది అప్పటికే కరోనా బారినపడిన వారితో కాంటాక్టు అవ్వడం వల్ల బాధితులుగా మారారు. కొందరికి కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించకపోవడం ఆందోళనకరమైన విషయమని ఐసీఎంఆర్‌ ప్రతినిధి మనోజ్‌ ముర్హేకర్‌ చెప్పారు. (మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ)

‘భారత్‌ కీ వీర్‌’ నుంచి వారికి నిధులు
విధులు నిర్వహిస్తూ కరోనా కారణంగా మరణించిన కేంద్ర పారామిలిటరీకి చెందిన సీఏపీఎఫ్‌ సైనికులకు రూ.15 లక్షలు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. వీరికి భారత్‌ కీ వీర్‌ నుంచి నిధులు కేటాయించనుంది. ఈ డబ్బుకు ఎక్స్‌గ్రేషియాకు సంబంధం లేదని తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటికే 8మంది సైనికులు మరణించగా, అందులో సీఐఎస్‌ఎఫ్‌కు చెందినవారు నలుగురు కాగా, సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. భారత్‌ కీ వీర్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా విరాళాలు అందించవచ్చని, ఈ విరాళాలకు నిబంధనలకు లోబడి పన్ను రాయితీ ఉంటుందని స్పష్టం చేసింది. (భారత్లో 5 వేలు దాటిన కరోనా మరణాలు..)

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?