రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అక్కడి నుంచి అన్ని విమానాలు రద్దు
Published on Mon, 11/21/2016 - 11:27
శ్రీనగర్: వరుసగా రెండో రోజు జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో సోమవారం అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా వెలుతురు మందగించడంతో విమానాలను రద్దు చేసినట్టు చెప్పారు.
ప్రతికూల వాతావరణంతో ఆదివారం కూడా విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అంతకుముందు రోజు కూడా పలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పరిస్థితిని సమీక్షించి విమాన సర్వీసుల పునరుద్దరణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో పొగమంచు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో విమాన ప్రయాణికులకు మరిన్ని రోజులు ఇబ్బందులు తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు.
#
Tags