amp pages | Sakshi

జీతాలు పెంచినా సమ్మె ఎందుకు?

Published on Fri, 09/02/2016 - 14:40

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది కార్మికులు శుక్రవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఫ్యాక్టరీలు, బ్యాంకులు, గనులు, రవాణా తదితర రంగాలకు చెందిన కార్మికులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కార్మికుడి కనీస దినసరి వేతనాన్ని 350 రూపాయలకు, అంటే నెలకు 9,100 రూపాయలకు పెంచినప్పటికీ, ఆ విషయాన్ని కేంద్రమే తాటికాయంత అక్షరాలతో ఈ రోజు వాణిజ్య ప్రకటనలతో పత్రికల్లో ఊదరగొట్టినప్పటికీ కార్మికులు ఎందుకు సమ్మెకు దిగారు? అందుకు కారణాలేమిటీ? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు.

వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు దేశ జనాభాలో 46 కోట్ల మంది ఉన్నారు. వారిలో వ్యవసాయేతర రంగాల కార్మికులకు మాత్రమే కేంద్రం కనీస వేతన ఉత్తర్వులు వర్తిస్తాయి. అందులోను కేవలం 48 కేటగిరీలకు చెందిన కార్మికులకు మాత్రమే కేంద్రం ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇనుప గనుల్లో పనిచేసే కార్మికులు, రైల్వే సరకుల అన్‌లోడింగ్, రాళ్లు కొట్టడం లాంటి కేటగిరీలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఈ రంగాల్లో ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 350 రూపాయలకన్నా ఎక్కువే పొందుతున్నారు. ఇక 1679 జాబ్ కేటగిరీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. ఈ క్యాటగిరీ కార్మికులకు కేంద్రం ఉత్తర్వులు వర్తించవు.

దేశంలోని మొత్తం 46 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 70 లక్షల మందే, అంటే 1.5 శాతం మంది కార్మికులు మాత్రమే కేంద్రం ప్రకటించిన కనీస వేతన ఉత్తర్వుల వల్ల లబ్ధి పొందుతారు. కేంద్ర వేతన సంఘం కనీస వేతనాన్ని 18 వేల రూపాయలుగా సిఫార్సు చేయగా, కార్మికులకు మాత్రం అందులో కనీస వేతనాన్ని సగానికి సగంగా నిర్ణయించడం అన్యాయమని కేంద్ర కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రాల  కిందకు వచ్చే 1679 కేటగిరీలకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం వేతనాలు ఇవ్వొచ్చు. ఇలాంటి అవకాశం లేకుండా కేంద్రం ఉత్తర్వులను తూచాతప్పకుండా రాష్ట్రాలు అమలు చేసేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కనీస వేతన బోర్డు సూచన మేరకే కార్మికుల కనీస వేతనాన్ని తాము 350 రూపాయలుగా నిర్ణయించామంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకోవడానికి ప్రయత్నించి తప్పులో కాలేశారు. కేవలం రెండు రోజుల నోటీసుతో ఆగస్టు 29న కనీస వేతన బోర్డు సబ్యుల సమావేశాన్ని కేంద్రం ఆదరాబాదరగా ఏర్పాటు చేసింది. అందులో తాము కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసిన మేరకు కార్మికుల కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించాలని తాము డిమాండ్ చేశామని, అయితే ఏకాభిప్రాయం కుదరక, ఎలాంటి నర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిందని కార్మిక సంఘాల తరఫున ప్రాథినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యుడు డాక్టర్ కాశ్మీర్ సింగ్ తెలిపారు.

బోనస్ చెల్లించడంలో, కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కార్మికుల కనీస బోనస్‌ను 3,500 రూపాయల నుంచి ఏడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు 2015, డిసెంబర్‌లో ఘనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ దాన్ని నోటిఫై చేయలేదు. దాంతో గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు బోనస్ చెల్లించలేదు. ప్రాఫిడెంట్, ప్రభుత్వ బీమా పథకం కింద అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న కేంద్రం హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కమిటీల మీద కమీటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. ఈ పథకం అమల్లోకి వస్తే దాదాపు 20 లక్షల మంది అంగన్‌వాడి కార్యకర్తలు ఎక్కువగా లబ్ధిపొందుతారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)