అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
Published on Mon, 03/31/2014 - 15:53
ఖాలిస్తానీ ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ నేత మనీందర్ జీత్ సింగ్ బిట్టా తనను తాను కాల్చుకుని చనిపోయేందుకు అనుమతినివ్వమని ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీని కోరారు.
'నన్ను చంపేందుకు కుట్రపన్ని కాల్పులు జరిపిన భుల్లర్ కి శిక్షను తగ్గించడం రాజకీయ టెర్రరిజం తప్ప మరేమీ కాదు. ఇక నేను బతికి ఉండి లాభం ఏమిటి? ఉగ్రవాదంపై పోరాటం చేసిన వారందరూ ఈ తీర్పులతో ఓడిపోయినట్టే. కాబట్టి కాల్చుకు చనిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి' అని ఆయన సోనియా గాంధీని కోరారు.
1993 సెప్టెంబర్ లో భుల్లర్ ఢిల్లీలో బాంబులు పేల్చాడు. ఈ ఉగ్రవాద ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. బిట్టా సహా 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలో భుల్లర్ ఒక కాలును కోల్పోయారు. తనను చంపేందుకు యత్నించిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడాన్ని బిట్టా తీవ్రంగా నిరసిస్తున్నారు.
#
Tags