మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
Published on Thu, 04/19/2018 - 10:51
జైపూర్ : రాజస్థాన్లోని అల్వార్ జిల్లా మండావర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మ్పాల్ చౌదరీ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. తీవ్ర గుండె నొప్పితో గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చిక్సిత పొందుతూ మృతి చెందారు. భారతీయ జనతా పార్టీ నుంచి 2003లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మ్పాల్ ఆ తర్వాత 2008, 2014లో కూడా మండావర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన ధర్మ్పాల్, జాట్ల ఉద్యమ సమయంలో ముఖ్య భూమిక పోషించారు. 2016లో ఓ జర్నలిస్టును ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడుతున్న టేపు బయటపడ్డ విషయంలో వార్తల్లో నిలిచిని ధర్మ్పాల్, ఆ జర్నలిస్టు తాను చెప్పింన దాన్ని వక్రీకరించి వార్తను తప్పుగా రాసినందుకే అలా అన్నానని వివరణ ఇచ్చారు.
#
Tags