వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
గోలీమారో సాలోంకో.. బీజేపీ భారీ ర్యాలీ
Published on Sun, 12/22/2019 - 15:50
సాక్షి, ముంబై: కొత్త పౌరసత్వ చట్టం (సీఏఏ)పై దేశంలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగపూర్లో ఆదివారం సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మద్దతు సంఘం లోక్ అధికార్ మంచ్ ఈ ర్యాలీకి నాయకత్వం వహించింది. స్థానిక యశ్వంత్ స్టేడియం నుంచి సంవిధాన్ చౌక్ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. 'సీఏఏను నాగపూర్ స్వాగతిస్తోంది' అనే ప్లకార్డులను పట్టుకున్న వందలాది కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సీఏఏకు అనుకూలంగా నినాదాలిచ్చారు. లోక్ అధికార్ మంచ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
పలువురు జాతీయపతాకాన్ని ఎగురవేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల పెద్దఎత్తున సీఏఏ వ్యతిరేక నిరసనలు ఎగసిపడుతున్న తరుణంలో నాగపూర్లో సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఉత్తరభారతంలో సహా, యూపీ, బిహార్లో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.
Tags