వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీజేపీ ఎంపీకి పాదపూజ
Published on Mon, 09/17/2018 - 11:02
రాంచీ : జార్ఖండ్కు చెందిన గొడ్డా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు పార్టీ కార్యకర్త ఓ కార్యక్రమంలో పాదపూజ చేయడం వివాదాస్పదమైంది. వేలాదిమంది చూస్తుండగా పవన్ సింగ్ అనే కార్యకర్త ఎంపీ దూబే కాళ్లు కడిగి, ఆ నీటిని పవిత్ర జలంగా భావిస్తూ తాగడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటనను సదరు ఎంపీ ఘనకార్యంలా తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వైఖరిని ఎంపీ సమర్ధించుకున్నారు. దీనికి రాజకీయ రంగు ఎందుకు పులుముతారని ప్రశ్నించారు. అతిధుల పాదాలను కడగటంలో తప్పేముందని అంటూ మహాభారతంలోని కథలను వినిపించారు. చవకబారు ఆలోచనలు చేయడం తగదని విమర్శకులకు చురకలు అంటించారు. కాళ్లు కడిగిన నీటిని తాగడంలోనూ తప్పులేదని ఇది చరణామృతమని వ్యాఖ్యానించారు.
#
Tags