ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గేదెను చంపారని గోరక్షకుల దాడి
Published on Sat, 05/13/2017 - 02:21
అలీగఢ్: గేదెను చంపారంటూ ఐదుగురిపై గోరక్షకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది. పన్నా గంజ్కు చెందిన కాలూ బాఘేల్ అనే వ్యక్తి తన డెయిరీలోని వట్టిపోయిన ఒక గేదెను ఇమ్రాన్ అనే పశువుల వ్యాపారికి అమ్మాడు.
దాన్ని కాలూ డెయిరీలోనే వధించేలా ఒప్పందం కుదిరింది. ఇమ్రాన్, మరో నలుగురు గేదెను వధిస్తుండగా రక్తం డెయిరీ గేటు బయటికి ప్రవహించింది. దీంతో గోరక్షకులతోపాటు పలువురు డెయిరీలోకి చొరబడి ఇమ్రాన్ బృందంపై దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు గేదెను అక్రమంగా చంపినందుకు ఇమ్రాన్ బృందంతోపాటు డెయిరీ యజమానిని కూడా అరెస్టు చేశారు.
#
Tags