వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్రైమ్ మాన్యువల్ అప్డేట్
Published on Thu, 09/12/2019 - 08:39
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ క్రైమ్ మాన్యువల్లోని ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని(ఎస్వోపీ) అప్డేట్ చేయనుంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా ఈ సవరణలు చేపట్టనుంది. ఇందుకోసం సీబీఐ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా నేతృత్వంలో ఓ బృందం గత 10 నెలలుగా పనిచేస్తోందని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్రైమ్ మాన్యువల్కు సంబంధించి కొత్త విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కొత్త చట్టాలు రావడం, సైబర్ నేరాలు అధికం కావడం, పలు కేసులకు సంబంధించి విదేశీ విచారణ సంస్థలు సాయం కోరుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సవరణలు చేపడుతున్నామని వెల్లడించారు.
#
Tags