amp pages | Sakshi

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు

Published on Fri, 06/26/2020 - 05:59

న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) , ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌( ఐసీఎస్‌ఈ) 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను కోవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షలు గత షెడ్యూల్‌ప్రకారం జూలైలో జరగాల్సిఉంది. ఇంటర్నల్‌ పరీక్షల్లో విద్యార్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ పరీక్షల్లో మార్కుల్ని నిర్ణయించి ఆగస్టులో ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి విద్యార్థుల్లో ఆసక్తి కలిగిన వారికి ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తారు. పరీక్ష రాస్తారా, లేదంటే గత మూడు పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా వచ్చిన సర్టిఫికెట్‌తో ముందుకు వెళతారా అన్నది వారి ఇష్టానికే వదిలిపెట్టారు.

ఇలాంటి అవకాశం పదో తరగతి విద్యార్థులకులేదు. ఐసీఎస్‌ఈ 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్, సంజీవ్‌ఖన్నాల సుప్రీంకోర్టు బెంచ్‌కు కేంద్రం, సీబీఎస్‌ఈ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలియజేశారు. జూలై 1–15 వరకు జరగాల్సిన మిగిలిన బోర్డు పరీక్షలన్నీ రద్దు చేసినట్టు సుప్రీంకు చెప్పారు. సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాయాలని భావించే విద్యార్థు లకు కోవిడ్‌ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షల్ని నిర్వహించవద్దంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం విచారణ చేపట్టిన సందర్భంగా కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి ఈ విషయాన్ని తెలిపింది.  

తాజా నోటిఫికేషన్‌ ఇవ్వండి : సుప్రీం
సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి విద్యార్థులకు ఇచ్చిన పరీక్షల ఆప్షన్, గత పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా మార్కులు ఏ విధంగా నిర్ణయిస్తారు ? , ఫలితాల తేదీ వంటివాటిపై కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి, సీబీఎస్‌ఈ బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండడం వల్ల పరీక్షల్ని ఎలా నిర్వహిస్తారో స్పష్టం చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేస్తామని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు చెప్పడంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. 

Videos

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

పిరియా విజయ పల్లె నిద్ర

ఈసీ షాక్..కుదేలైన కూటమి..

అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద

ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)