రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీబీఎస్ఈ ప్లస్ 2 ఫలితాల విడుదల
Published on Sat, 05/21/2016 - 11:37
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 10.67 లక్షల మంది విద్యార్థులు (ప్లస్ 2) ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జేఈఈతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
సీబీఎస్ఈ ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్టు ముందుగా సంకేతాలు ఇచ్చారు. ఫలితాలను www.cbseresults.nic.in లో చూసుకోవచ్చు.
- ఢిల్లీలోని మోంట్ఫోర్ట్ స్కూలుకు చెందిన సుక్రితీ గుప్తా 500మార్కులకుగానూ 497 మార్కులతో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది.
- హర్యానాలోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్కు చెందిన పాలక్ గోయల్ 496 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది.
- హర్యానాలోని సెయింట్ థెరిస్సా కాన్వెంట్ స్కూల్కు చెందిన సోమ్యా ఉప్పల్ 495 మార్కులతో మూడో ర్యాంకు సాధించింది.
-
తమిళనాడులోని అజిత్ శేఖర్ 495 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచాడు.
#
Tags